భారతదేశం, జనవరి 21 -- తెలంగాణా కుంభమేళాగా పేరుపొందిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఈసారి అత్యంత వైభవంగా నిర్వహించాలని తెలంగాణ సర్కార్ భావిస్తోంది. ఆ దిశగా అభివృద్ధి పనులు పూర్తి చేస్తుండగా.. మరోవైపు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని చూస్తోంది. ముఖ్యంగా భద్రతపరంగా ఈసారి మేడారం జాతరలో ఆధునిక సాంకేతికతను ఉపయోగించనుంది.

జనవరి 28 నుంచి 31 వరకు జరగనున్న మేడారం జాతర కోసం తెలంగాణ ప్రభుత్వం, పోలీస్ శాఖ ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ (AI) ఆధారిత వ్యవస్థలను ఉపయోగిస్తున్నాయి. ఇటీవలనే జాతరలో కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ప్రారంభించారు.

మేడారం జాతరలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం, ఎవరూ తప్పిపోకుండా ప్రజలందరికీ సురక్షిత జాతర అనుభవం కలిగించేలా జాతర భద్రతను పర్యవేక్షించేందుకు 'టీజీ-క్వెస్ట్‌' అనే అత్యాధునిక ఏఐ డ్రోన్ వ్యవస్థను ప్రవేశపెట్టారు. ఈ వ్యవస్థ ద్వారా...