భారతదేశం, జూన్ 9 -- దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయలో దంపతుల మిస్సింగ్​ కేసు పెద్ద యూ- టర్న్​ తీసుకుంది! మధ్యప్రదేశ్​ నుంచి దంపతులు హనీమూన్​ కోసం మేఘాలయకు వెళ్లి అదృశ్యమయ్యారని ఇంతకాలం భావించగా.. భర్యే భర్తను చంపించిందని తాజాగా తేలింది. ఈ మేరకు ముగ్గురు కాంట్రాక్ట్​ కిల్లర్ల చేత భర్తను చంపించిన మహిళను పోలీసులు తాజాగా అరెస్ట్​ చేశారు.

రాజ రఘువంశి, అతని భార్య సోనమ్​లు మే నెలలో హనీమూన్​కి వెళ్లారు. కానీ వారిద్దరు చివరిసారిగా మే 23న కనిపించారు. ఆ తర్వాత మాయమైపోయారు. అదృశ్యమైన దంపతుల కోసం పోలీసులు తీవ్రస్థాయిలో గాలింపు చర్యలు చేపట్టారు. కానీ దాదాపు వారం రోజుల పాటు వారి ఆచూకీ లభించలేదు. ఈ నేపథ్యంలో జూన్​ 2న రాజ మృతదేహం చిరాపుంజికి సమీపంలోని ఒక లోయలో కనిపించింది. సోనమ్​ జాడను మాత్రం ఎవరూ గుర్తించలేకపోయారు.

కాగా సోనమ్​ కిడ్నాప్​ అయ్యుండొ...