భారతదేశం, ఫిబ్రవరి 1 -- హిందీ చిత్ర పరిశ్రమలో ఎన్నో ఏళ్లుగా నలుగుతున్న వివాదాల్లో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ నటించిన 'షూబైట్' (Shoebite) సినిమా ఒకటి. షూటింగ్ పూర్తయినా ఇప్పటికీ చిత్రం విడుదల అవ్వకపోడానికి వెనుక ఉన్న అసలు కారణాలను ప్రముఖ నిర్మాత శైలేంద్ర సింగ్ తాజాగా బయటపెట్టారు. 'పేజ్ 3', 'ట్రాఫిక్ సిగ్నల్' వంటి జాతీయ అవార్డు చిత్రాలను నిర్మించిన ఆయన.. అమితాబ్ బచ్చన్, దర్శకుడు షూజిత్ సర్కార్‌లపై సంచలన ఆరోపణలు చేశారు.

ఒక ఇంటర్వ్యూలో శైలేంద్ర సింగ్ మాట్లాడుతూ, "నిజానికి నేను షూజిత్ సర్కార్‌తో కలిసి 'జానీ వాకర్' (షూబైట్ ఫస్ట్ టైటిల్) అనే కథను డెవలప్ చేశాను. ఈ కథను అమితాబ్ బచ్చన్‌కు వినిపించి, ఆయన్నే హీరోగా ఖరారు చేశాం. ఇందుకోసం బిగ్ బికి అడ్వాన్స్‌గా రూ. 4 కోట్లు చెల్లించాను. అగ్రిమెంట్ కూడా పూర్తయింది. షూజిత్‌ను స్వయంగా నేనే జల్సాక...