భారతదేశం, ఏప్రిల్ 26 -- మచ్​ అవైటెడ్​ ఈ విటారా ఎలక్ట్రిక్​ ఎస్​యూవీపై కీలక అప్డేట్​ ఇచ్చింది మారుతీ సుజుకీ సంస్థ. ఈ విటారాను భారత దేశంతో పాటు ఎగుమతి మార్కెట్​లో విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించింది. ఈ మేరకు 2025 సెప్టెంబర్​లో డెలివరీలు మొదలవుతాయని స్పష్టం చేసింది.

దేశీయ దిగ్గజం మారుతీ సుజుకీ నుంచి వస్తున్న తొలి ఎలక్ట్రిక్​ వెహికిల్​ ఈ ఈ విటారా. 2025 ఆటో ఎక్స్​పోలో సంస్థ దీనిని ప్రదర్శించింది. ఈ ఆల్​- ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ అందరిని ఆకర్షించింది.

మారుతీ సుజుకీ ఛైర్మన్ ఆర్.సీ.భార్గవ ఇటీవల నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఈ విటారా డెలివరీలు 2025 సెప్టెంబర్ నాటికి భారతదేశంలో ప్రారంభమవుతాయని ధృవీకరించారు. ఈ ఏడాది 70,000 ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేయాలని యోచిస్తున్నట్లు కంపెనీ అధికారులు మీడియాకు తెలిపారు. మొత్తం 70,000 ...