భారతదేశం, ఫిబ్రవరి 3 -- ప్రతి ఏటా మాఘ మాసంలో వచ్చే కృష్ణ పక్ష చతుర్దశి నాడు మహాశివరాత్రిని జరుపుకుంటాము. శివుడికి, పార్వతీదేవికి శివరాత్రి అంకితం చేయబడింది. ఆ రోజు వారిద్దరూ ఒకటయ్యారని చెబుతారు. మహాశివరాత్రి (Maha shivaratri 2026) నాడు శివుడు, పార్వతి ఒకటైన సందర్భంగా ప్రత్యేక పూజలు చేయడం, కొన్ని పరిహారాలను పాటించడం వంటివి చేస్తూ ఉంటాము. పైగా శివుడికి ఎంతో ఇష్టమైన బిల్వపత్రాలను ఆ రోజు సమర్పిస్తాము.

ఈ ఏడాది మహాశివరాత్రి ఫిబ్రవరి 15, 2026న వచ్చింది. ఆ రోజు కొన్ని ప్రత్యేకమైన యోగాలు కూడా ఏర్పడటం విశేషం. శివరాత్రి నాడు శివ, పార్వతులను ఆరాధించడం వలన అదృష్టం కలగడంతో పాటు సంతోషం, వివాహ జీవితంలో ఆనందం ఉంటుంది. అలాగే జీవితంలో పురోగతిని చూస్తారు. వ్యాపారంలో కూడా బాగా కలిసి వస్తుంది. శివరాత్రి నాడు ఉపవాసం ఉండి జాగరణ చేస్తే కూడా శివుని ప్రత్యేక అనుగ్...