భారతదేశం, మే 14 -- రుతుపవనాలు రాక ముందే దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరీ ముఖ్యంగా మంగళవారం కురిసిన అతి భారీ వర్షాలకు బెంగళూరు మహా నగరం అతలాకుతలమైంది. ముంబై, దిల్లీల్లోనూ వర్షాలు పడి మండే ఎండల నుంచి ప్రజలకు ఉపశమనాన్ని ఇచ్చాయి. రానున్న రోజుల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ అలర్ట్​లు జారీ చేసింది.

సిలికాన్​ వ్యాలీలో ఆఫ్​ ఇండియాగా పేరొందిన బెంగళూరుకు ఐఎండీ యెల్లో అలర్ట్​ జారీ చేసింది. మే 16 వరకు ఉరుములు, మెరుపులు, భారీ వర్షాలు, ఈదురుగాలులతో కూడిన తీవ్రమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయని హెచ్చరిక ఇచ్చింది.

మంగళవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి వైట్ ఫీల్డ్, బ్రూక్ ఫీల్డ్, మహదేవపుర సహా ప్రధాన రహదారులు జలమయం కావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.

మాన్యతా టెక్ పార్క్ సమీపంలో వర్షపు నీరు.. కదులుతున్న బీఎంటీసీ బస్సులోకి ప్రవేశి...