భారతదేశం, మే 5 -- మండుటెండల మధ్య భారత వాతావరణ శాఖ (ఐఎండీ) దేశ ప్రజలకు చల్లటి వార్తను అందించింది. ఆంధ్రప్రదేశ్​ సహా రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. పలు ప్రాంతాల్లో వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు కూడా వీస్తాయని వెల్లడించింది.

రానున్న 2-3 రోజుల్లో గుజరాత్, రాజస్థాన్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హరియాణా, చంఢీగఢ్, దిల్లీ, ఉత్తరప్రదేశ్ సహా వాయవ్య ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది.

ఒడిశా, పశ్చిమ్​ బెంగాల్ రాష్ట్రాల్లో మే 7 నుంచి ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

ఐఎండీ శాస్త్రవేత్త డాక్టర్ సంజీవ్ ద్వివేది మాట్లాడుతూ.. 5...