భారతదేశం, మే 14 -- సుప్రీంకోర్టు 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బీఆర్ గవాయ్ బుధవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. దిల్లీలోని రాష్ట్రపతి భవన్​లో జరిగిన కార్యక్రమంలో ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. 2025 నవంబర్​ వరకు, అంటే ఆరు నెలల పాటు సీజేఐగా పనిచేయనున్నారు జస్టిస్​ గవాయ్.

సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా మంగళవారం పదవీ విరమణ చేసిన జస్టిస్ సంజీవ్ ఖన్నా స్థానంలో జస్టిస్ గవాయ్ బాధ్యతలు చేపట్టారు.

దళిత సామాజికవర్గం నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన రెండో వ్యక్తి జస్టిస్ గవాయ్. ఆయన కంటే ముందు మాజీ సీజేఐ కేజీ బాలకృష్ణన్ 2007లో తొలి దళిత సీజేఐ అయ్యారు.

Published by HT Digital Content Services with permission from HT Telugu....