భారతదేశం, మే 10 -- పహల్గామ్​ ఉగ్రదాడి, ఆపరేషన్​ సిందూర్​ అనంతర పరిస్థితులతో భారత్​- పాకిస్థాన్​ మధ్య ఉద్రిక్తతలు క్షణక్షణానికి తీవ్రతరం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో సరిహద్దుతో పాటు దేశవ్యాప్తంగా ప్రజలు ఆందోళనకు గరవుతున్నారు. అయితే, ప్రజలకు రియల్​-టైమ్​ అలర్ట్స్​ని ఇచ్చేందుకు కేంద్రం ఎప్పటికప్పుడు కృషిచేస్తోంది. స్మార్ట్​ఫోన్స్​లో కూడా అలర్ట్స్​ని ఇస్తోంది. వాటిని చూసి మనం వెంటనే స్పందించి, మన రక్షణని చూసుకోవచ్చు. ఆండ్రాయిడ్​తో పాటు ఐఫోన్స్​లకు ప్రభుత్వం నుంచి అలర్ట్స్​ పొందే మెకానిజం ఉంది. ఈ హెచ్చరికలు డైరెక్ట్​గా మీ మొబైల్​లోకి వస్తాయి. వీటిల్లో ఎమర్జెన్సీ కంటెంట్​ ఉంటుంది. అయితే కొన్ని డివైజ్​లలో ఎమర్జెన్సీ అలర్ట్స్​ డిసేబుల్​ చేసి ఉంటాయి. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల్లో వీటిని ఎనేబుల్​ చేసుకోవడం చాలా అవసరం. అందుకే, ఆండ్రాయిడ్​, ఐఫోన్స్​లో ...