భారతదేశం, మే 24 -- ఇండియాలోకి మరో ఫ్యామిలీ కారు అడుగుపెట్టింది. దాని పేరు కియా క్యారెన్స్​ క్లావిస్​. ఇదొక ఎంపీవీ. ఈ మోడల్​ని తాజాగా ఇండియాలో లాంచ్​ చేసింది దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ కియా మోటార్స్​. రూ .25,000 టోకెన్ అమోంట్​తో క్యారెన్స్ క్లావిస్ బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. కొన్ని డీలర్​షిప్​ షోరూమ్స్​ వద్ద, ఎంపీవీ ఇప్పుడు వినియోగదారులు వ్యక్తిగతంగా చెక్​ చేయడానికి అందుబాటులో ఉంది. త్వరలోనే డెలివరీలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఈ కియా క్యారెన్స్​ క్లావిస్​ ధరతో పాటు ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

కియా కారెన్స్ క్లావిస్ ఫ్యామిలీ ఎంపీవీ ఏడు వేరియంట్లలో లభిస్తుంది. హెచ్​టీఈ, హెచ్ టీఈ(ఓ), హెచ్ టీకే, హెచ్ టీకే+, హెచ్​టీకే+(ఓ), హెచ్​టీఎక్స్ , హెచ్​టీఎక్స్ + ఉన్నాయి. ఏ వేరియంట్​లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి? అన్నది తెలుసుకునేందుకు ఇక్కడ...