భారతదేశం, మే 11 -- పహల్గామ్​ ఉగ్రదాడి, ఆపరేషన్​ సిందూర్​ నేపథ్యంలో భారత్​- పాకిస్థాన్​లు దాదాపు యుద్ధం అంచు వరకు వెళ్లాయి. శనివారం సాయంత్రం జరిగిన కాల్పుల విరమణ ఒప్పందానికి ముందు ఇరు దేశాలు పరస్పర దాడులకు దిగాయి. వీటి వల్ల పాకిస్థాన్​కి చాలానే నష్టం జరిగింది. వీటన్నింటి మధ్య సోషల్​ మీడియాలో తప్పుడు సమాచారం విపరీతంగా వ్యాపించింది. మరీ ముఖ్యంగా పాకిస్థాన్​లో పరిస్థితులు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. బెంగళూరు 'పోర్టు'ను పాక్​ నేవీ ధ్వంసం చేసిందని అక్కడి ప్రజలు సంబరాలు చేసుకున్నారు! ఈ వ్యవహారం ఎక్స్​లో వైరల్​ అయ్యింది. అది గమనించిన భారతీయులు పాకిస్థానీలను ట్రోల్​ చేయడం మొదలుపెట్టారు. అసలేం జరిగిందంటే..

బెంగళూరు ఓడరేవును పాకిస్థాన్ నావికాదళం 'నాశనం' చేసినందుకు సంబరాలు చేసుకున్న పాకిస్థానీయులను సీనియర్ ఐపీఎస్ అధికారి అరుణ్ బోత్రా సహా వేలాది మంది...