భారతదేశం, మే 20 -- ఈ నెల 21 నుంచి అరేబియా సముద్రంలో కర్ణాటక సమీపంలో వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 22వ తేదీ నాటికి ఈ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ''ఈ నెల 21న కర్ణాటక తీరంలో తూర్పు మధ్య అరేబియా సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో మే 22న ఇదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఆ తర్వాత ఉత్తర దిశగా పయనించి మరింత బలపడే అవకాశం ఉంది'' అని ఐఎండీ హెచ్చరించింది.
తమిళనాడు, కర్ణాటక, కేరళ, గోవా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా ద్వీపకల్ప ప్రాంతంలో సోమవారం భారీ వర్షాలు కురిశాయి. ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ వర్షాలు కురిశాయని, రానున్న రోజుల్లో రుతుపవనాల ముందు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. హర్యానా, రాజస్థాన్, అస్సాం, మహారాష్ట్ర, బంగా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.