భారతదేశం, ఫిబ్రవరి 2 -- తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. సిట్ విచారణలో ఏం జరిగిందో మాజీ సీఎం కేసీఆర్ చెప్పే ఉంటారని భావిస్తున్నట్టుగా కవిత పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు రెండేళ్లు అవుతున్నా.. విచారణ ముగింపునకు రావడం లేదన్నారు. విచారణ ముగిసి.. త్వరగా దోషులకు శిక్ష పడేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.

సిట్ విచారణను కేటీఆర్ తప్పుపట్టడం సరికాదని కవిత అన్నారు. చట్టాలను అందరూ గౌరవించాలని, సహకరించాలని వ్యాఖ్యానించారు. గుంట నక్కలతో కలిసి కాంగ్రెస్ పార్టీ డ్రామాలు ఆడుతుందని విమర్శించారు. తనతోపాటుగా తన భర్త ఫోన్లు కూడా ట్యాప్ చేశారనే అనుమానాలు ఉన్నాయన్నారు. సిట్ విచారణకు అధికారులు పిలిస్తే.. వెళ్లి సహకరిస్తానని చెప్పారు.

'ఫోన్ ట్యాపింగ్ కేసును పారదర్శకంగా విచారణ జరపాలి. కేసీఆర్ గత ప్రభుత్వంలో ముఖ...