భారతదేశం, ఫిబ్రవరి 2 -- ఫ్లైఓవర్లు, ఎలివేటెడ్ కారిడార్లు, రోడ్ల విస్తరణ, మెట్రో రైలుటేకోవర్‌ ఖర్చులకు నిధులను సమీకరించడానికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ) మరోసారి ప్లాట్ల వేలం కోసం సన్నాహాలు ప్రారంభించింది. నవంబర్‌లో కోకాపేట నియోపోలిస్‌లో జరిగిన ఆన్‌లైన్ వేలానికి మంచి స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో హెచ్ఎండీఏ అధికారులు మరోసారి భూములను వేలం వేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. హెచ్ఎండీఏ నేరుగా అమలు చేస్తున్న అనేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు మద్దతుగా కొత్త ఆన్‌లైన్ బిడ్డింగ్‌ను ప్లాన్ చేస్తోంది.

ఉప్పల్ భగాయత్, మోకిలా, లేమూరు ప్రాంతాల్లో భూములను వేలం వేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ ప్రాంతాలలో మిగిలిన ప్లాట్‌లను ఫిబ్రవరిలో ఆన్‌లైన్ బిడ్డింగ్‌కు ఉంచుతామని అధికారులు చెప్పారు. దశలవారీగా ఇన్ముల్‌నర్వా, లెమూర్, తుర్కయాంజల్‌...