భారతదేశం, మే 15 -- ప్యాసింజర్‌ రైల్లో మంటలు చెలరేగడంతో ప్రయాణికులు ఆందోళనకు గురైన ఘటన బీబీ నగర్‌ రైల్వే స్టేషన్‌లో జరిగింది. మిర్యాలగూడ నుంచి కాచిగూడకు వెళుతున్న పుష్‌ పుల్‌ ట్రైన్‌ అడుగు భాగంలో మంటలు చెలరేగాయి. రైలు కింద భాగంలో మంటల్ని గుర్తించిన ప్రయాణికులు బీబీ నగర్‌ రైల్వే స్టేషన్‌లో రైల్వే సిబ్బందికి సమాచారం అందించారు.

రైలు దిగువన మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన సిబ్బంది రైలును నిలిపివేశారు. రైలు కింద భాగంలో చెలరేగిన మంటల్ని సిబ్బంది ఆర్పివేశారు. ఈ ప్రమాదంతో రైల్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో దానిని నిలిపివేశారు. దాదాపు గంటన్నరకు పైగా బీబీ నగర్‌ రైల్వే స్టేషన్‌లోనే రైలు నిలిచిపోయింది. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

హైదరాబాద్‌ అఫ‌్ఝల్‌ గంజ్‌ ప్రాంతంలో ఉన్న నాలుగు అంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. భవనం కింద భాగంలో పేపర్‌...