భారతదేశం, ఏప్రిల్ 17 -- ఎంత వీలైతే అంత మంది పిల్లల్ని కని, ప్రపంచ భవిష్యత్తును ముందుకు తీసుకెళ్లడమే ధ్యేయంగా పెట్టుకున్న ఎలాన్​ మస్క్​.. దాన్ని సరికొత్త పంథాలో అమలు చేస్తున్నట్టు తెలుస్తోంది! పిల్లల్ని కనేందుకు కావాల్సిన మహిళలను ఎక్స్​ వేదికగా ఆయన 'రిక్రూట్​' చేసుకుంటున్నట్టు వాల్​స్ట్రీట్​ జర్నల్​ ఒక నివేదికను తాజాగా బయటపెట్టింది. అసలు ఏం జరిగిందంటే..

ప్రజలు పిల్లల్ని కనాలని ప్రోత్సహించే వారిలో అపర కుబేరుడు ఎలాన్​ మస్క్​ ముందు వరుసలో ఉంటారు. 'ప్రపంచానికి జననాల రేటు పతనానికి మించిన దారుణం ఏం ఉండదు. ప్రజలు పిల్లల్ని కనకపోతే ఇక అంతే!' అని మస్క్​ ఇప్పటికే చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు.

అయితే పిల్లల్ని కనేందుకు మస్క్​ ఎంత దూరం వెళతారు అనేది వాల్​స్ట్రీట్​ జర్నల్​ తాజా నివేదిక స్పష్టం చేస్తోంది. నివేదిక ప్రకారం ప్రపంచ జనాభా కుప్పకూలడాన్ని ...