భారతదేశం, ఫిబ్రవరి 5 -- తిరుపతి లడ్డూ నెయ్యి కల్తీ కేసులో వైసీపీకి సీబీఐ క్లీన్ చిట్ ఇవ్వలేదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసంలో కూటమి నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు. మత విశ్వాసం సున్నితమైన సమస్య అని. ఈ విషయాల గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని వ్యాఖ్యానించారు.

"2019 నుండి 2024 వరకు వైసీపీ పాలనలో చాలా అపచారాలు జరిగాయి. మతం పరంగా మాట్లాడటానికి సున్నితమైన అంశాలు. ప్రభుత్వంలోకి వచ్చిన రెండో నెలల్లో ఆరోపణలు, విమర్శలు చేసి రాజకీయ లబ్ధి పొందడానికి అవసరం ఏముంటుంది ? ఆధారాలు ఉన్నాయి కాబట్టే మాట్లాడాం. రేపు ప్రజలు మాకు తెలిసినా ఎందుకు చెప్పలేదు అని అడుగుతారు అనే బయటకొచ్చి మాట్లాడాం. హైందవ సంస్కృతి మీద వైసీపీ తరచుగా దాడులు, అపవిత్రాలకు తెగబడుతుండడం వల్ల ఎదుర్కోవాల్సిన అవసరం, మాట్...