భారతదేశం, మే 4 -- నేడు నీట్​ యూజీ 2025 పరీక్ష జరగనుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్టు ఎన్టీఏ (నేషనల్​ టెస్టింగ్​ ఏజెన్సీ) వెల్లడించింది. దేశంతో పాటు 13 అంతర్జాతీయ నగరాల్లోని 5,453 కేంద్రాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు జరగనున్న ఈ నీట్​ యూజీ 2025 కోసం 22.7లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.

వైద్య రంగంలో కీలక, కఠినమైన పరీక్షగా ఈ నీట్​ యూజీని భావిస్తారు. ఈ దఫా పరీక్ష నిర్వహణ కోసం ఎగ్జామ్​ సెంటర్స్​లో ఇప్పటికే మాక్​ డ్రిల్స్​ చేపట్టినట్టు అధికారులు వెల్లడించారు.

"ప్రిపరేషన్స్​, లాజిస్టికల్​ ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. పరీక్షను సేఫ్​గా, సెక్యూర్​గా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టాము," అని ఒక అధికారిక స్టేట్​మెంట్​ ద్వారా ఎన్టీఏ వెల్లడించింది.

నీట్​ యూజీ 2025లో ఎలాంటి తప్పులు జరగకుండా తగిన చర్యలు చేపట్టింది ఎన్టీఏ. ఈ మేర...