భారతదేశం, ఫిబ్రవరి 2 -- బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతున్న సమయంలో రాహుల్ గాంధీ ఈ అంశాన్ని లేవనెత్తారు. మాజీ సైన్యాధ్యక్షుడు జనరల్ ఎం.ఎం. నరవాణే రాసిన 'ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ' (Four Stars of Destiny) అనే పుస్తకం నుంచి కొన్ని వ్యాఖ్యలను ఆయన చదవబోయారు. "డోక్లాంలో చైనా ట్యాంకులు..." అని రాహుల్ అనగానే అధికార పక్షం ఒక్కసారిగా అడ్డుపడింది.

రాహుల్ గాంధీ ప్రసంగాన్ని అడ్డుకుంటూ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేరుగా రంగంలోకి దిగారు. "ఆ పుస్తకం అసలు ప్రచురణ అయ్యిందా? లేదా? అని నేను అడుగుతున్నాను. ప్రచురితం కాని పుస్తకం నుంచి లోకసభలో ఎలా కోట్ చేస్తారు? అది అసలు అధికారిక సమాచారమే కాదు" అని రాజ్‌నాథ్ సవాల్ విసిరారు.

హోం మంత్రి అమిత్ షా కూడా ఇదే రీతిలో స్పందిస్తూ, ప్రచురించని పుస్తకం ఆధారంగా...