భారతదేశం, ఫిబ్రవరి 5 -- హిందీ సినిమా హిస్టరీలోనే 'ధురంధర్' ఒక సంచలనంగా మారింది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్ నటించిన ఈ స్పై థ్రిల్లర్.. బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టడమే కాకుండా, లాభాల విషయంలోనూ ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. పాన్ ఇండియా హిట్లయిన 'ఆర్ఆర్ఆర్', 'కేజీఎఫ్ ఛాప్టర్ 2' లాంటి సినిమాలను కూడా లాభాల రేసులో 'ధురంధర్' దాటేయడం ఇప్పుడు హాట్ టాపిక్.

వాస్తవానికి 'ధురంధర్' ఒకే సినిమాగా విడుదల కావాల్సి ఉంది. కానీ సినిమా నిడివి 6 గంటలు దాటడంతో, ఎడిటింగ్ టేబుల్ దగ్గర దర్శకుడు ఆదిత్య ధర్, నిర్మాతలు ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. అదే సినిమాను రెండు భాగాలుగా విడగొట్టడం. విడుదలకి కొన్ని వారాల ముందు తీసుకున్న ఈ నిర్ణయమే ఇప్పుడు నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది.

మొదటి భాగం క్లిక్ అయితేనే రెండో భాగం అమ్ముడుపోతుంద...