భారతదేశం, మే 25 -- తమిళ స్టార్ ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున కలిసి నటిస్తున్న కుబేర సినిమాపై చాలా అంచనాలు ఉన్నాయి. స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఈ సోషల్ థ్రిల్లర్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. స్టార్ హీరోయన్ రష్మిక మందన్నా కూడా ఓ ముఖ్యమైన పాత్ర చేశారు. ఈ చిత్రం జూన్ 20న విడుదల కానుంది. ఈ తరుణంలో కుబేర సినిమా టీజర్ నేడు (మే 25) వచ్చేసింది.

ట్రాన్స్ ఆఫ్ కుబేర పేరుతో టీజర్ వచ్చింది. నాది.. నాది అంటూ టీజర్ అంతా ఓ మాంటేజ్ సాంగ్ వస్తుంటుంది. ఈ చిత్రంలో క్యారెక్టర్ల స్వభావం తెలిపేలా పాటలో లిరిక్స్ సాగుతుంటాయి. జిమ్ సరభ్ ఈ చిత్రంలో బడా వ్యాపారవేత్తగా ఉంటారు. ఈ లోకంలోని నీరు, భూమి సహా వనరులన్నీ నావే అనుకునేలా జిమ్ క్యారెక్టర్ ఉంటుందని పాట ద్వారా అర్థమవుతోంది. నాగార్జున జైలులో ఉన్నట్టుగా.. ఆ తర్వాత భారీగా డబ్బు ముందు నిల్చున్నట్టు షాట్స్ ఉ...