భారతదేశం, మే 19 -- రానున్న వారం రోజుల పాటు భారత్​లోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరికలు జారీ చేసింది. మే 24 వరకు దేశంలోని కోస్తా, ఈశాన్య ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తాజాగా విడుదల చేసిన అడ్వైజరీలో పేర్కొంది.

ఐఎండీ ప్రకారం.. కర్ణాటక, కొంకణ్, గోవా, కేరళ సహా పశ్చిమ తీరం, ద్వీపకల్ప భారతంలోని పరిసర ప్రాంతాల్లో మే 18 నుంచి మే 24 వరకు భారీ వర్షాలు కురుస్తాయి. ఈ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిసే అవకాశం ఉంది. స్థానికంగా వరద పరిస్థితి ఏర్పడవచ్చు.

రాబోయే 5-6 రోజుల్లో ఈశాన్య భారతదేశం, సబ్ హిమాలయన్ పశ్చిమ బెంగాల్, సిక్కింలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.

గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, దీంతో చెట్...