భారతదేశం, మే 5 -- తెలంగాణలో రూ.6వేల కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు నితన్ గడ్కరీ శంకుస్థాపన చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ద్వారా సముద్రంలో వృధాగా కలిసి నీటిని పెన్నా-కావేరి బేసిన్‌లకు తరలించేందుకు ప్రయత్నిస్తున్నట్టు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు.

ఆదిలాబాద్‌లో కేంద్రప్రభుత్వం చేపట్టిన పలు ప్రాజెక్టుల్ని నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేశారు. రూ.6వేల కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు నితన్ గడ్కరీ శంకుస్థాపన చేశారు. తెలంగాణ వికాసానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. సాగునీటి ప్రాజెక్టులతో ఆంధ్రా, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు సముద్రంలో వృధాగా కలిసే నీటిని మళ్లిస్తామని చెప్పారు.

ప్రజల పరిస్థితులు మారాలంటే విద్య ఒక ఆయుధమని, తెలంగాణలో యువతకు ఉపాధి దొరకాలి..రైతులకు మద్దతు ధర రావాలంటే బీజేపీతోనే సాధ్యమన్నారు. తెలంగాణ సీఎ...