భారతదేశం, ఫిబ్రవరి 6 -- బాలీవుడ్ సీనియర్ నటుడు, స్టార్ కమెడియన్ రాజ్‌పాల్ యాదవ్ చిక్కుల్లో పడ్డారు. గత కొంతకాలంగా ఆయన్ని వేధిస్తున్న చెక్ బౌన్స్ కేసులో ఎట్టకేలకు రాజ్‌పాల్ యాదవ్ జైలు బాట పట్టాల్సి వచ్చింది. ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు గురువారం (ఫిబ్రవరి 5) సాయంత్రం 4 గంటలకు రాజ్‌పాల్ యాదవ్ తీహార్ జైలు అధికారుల ముందు లొంగిపోయారు. లొంగుబాటు గడువును పొడిగించేందుకు హైకోర్టు నిరాకరించడంతో రాజ్‌పాల్ యాదవ్‌కు జైలు శిక్ష తప్పలేదు.

బుధవారం జరిగిన విచారణలో రాజ్‌పాల్ యాదవ్ తరపు న్యాయవాది కోర్టుకు ఒక అభ్యర్థన చేశారు. తన క్లయింట్ రూ. 50 లక్షలు సిద్ధం చేశారని, మిగిలిన మొత్తాన్ని చెల్లించేందుకు మరో వారం రోజుల సమయం కావాలని కోరారు. అయితే, దీనిపై న్యాయమూర్తి తీవ్రంగా స్పందించారు.

"కేవలం ఒక వ్యక్తి ప్రత్యేక నేపథ్యం లేదా సినిమా రంగానికి చెందిన వాడు అన్న క...