భారతదేశం, ఫిబ్రవరి 23 -- తిరుమల శ్రీవారి దర్శనంతో పాటు కాణిపాకానికి IRCTC టూరిజం కొత్త టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది.హైదరాబాద్ నుంచి ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్రిప్ 28 ఫిబ్రవరి 2026వ తేదీన అందుబాటులో ఉంది.

ఈ ప్యాకేజీని " తిరుపతి బై వెంకటాద్రి ఎక్స్ ప్రెస్" పేరుతో ఐఆర్సీటీసీ టూరిజం ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తుంది. హైదరాబాద్ ఆపరేట్ చేసే ఈ ట్రిప్. నాలుగు రోజులు ఉంటుంది. తిరుచానూరు పద్మావతి ఆలయం, శ్రీవారి ఆలయం, శ్రీకాళహస్తి టెంపుల్ ను దర్శించుకోవచ్చు. ముందుస్తుగానే టికెట్లు బుకింగ్ చేసుకోవాలి. ఈ తేదీ మిస్ అయితే మరో తేదీలో ప్లాన్ చేసుకోవచ్చు. ఈ వివరాలను IRCTC అధికారిక వెబ్ సైట్ లో చూడొచ్చు.

తిరుపతి - హైదరాబాద్ టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే.. కంఫర్ట్ క్లాస్ లో సింగిల్ షేరింగ్ లో రూ. 13,950, డబుల్ షేరింగ్ కు రూ. 10,860, ట్రిప...