భారతదేశం, జూలై 22 -- సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు లాభాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 443 పాయింట్లు పెరిగి 82,200 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 122 పాయింట్లు వృద్ధిచెంది 25,091 వద్ద సెషన్​ని ముగించింది. బ్యాంక్​ నిఫ్టీ 670 పాయింట్లు పెరిగి 56,953 వద్దకు చేరింది.

సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 1681.23 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 3,578.43 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు.

ఈ జులై​ నెలలో ఎఫ్​ఐఐలు ఇప్పటివరకు మొత్తం మీద రూ. 18,636.98 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 25,471.95 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఇక దేశీయ స్టాక్​ మార్కెట్​లు.. మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ని లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 60 పాయింట్ల...