భారతదేశం, జూన్ 20 -- ఇజ్రాయెల్​- ఇరాన్​ ఉద్రిక్తతల నేపథ్యంలో గురువారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు స్వల్ప నష్టాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 83 పాయింట్లు పడి 81,362 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 19 పాయింట్లు పతనమై 24,793 వద్ద సెషన్​ని ముగించింది. బ్యాంక్​ నిఫ్టీ 251 పాయింట్లు పడి 55,577 వద్దకు చేరింది.

గురువారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 365.68 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1,008.43 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు.

ఇక దేశీయ స్టాక్​ మార్కెట్​లు.. శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని ఫ్లాట్​గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 10 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.

"మార్కెట్​లో నెగిటివ్​ సెంటిమెంట్​ కనిపిస్తోంది. నిఫ్టీ50 24,850 దిగువన కొనసాగినంత కాలం ఇదే కొనసాగవచ్చ...