భారతదేశం, జూన్ 17 -- సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు లాభాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 676 పాయింట్లు పెరిగి 81,796 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 228 పాయింట్లు వృద్ధిచెంది 24,946 వద్ద సెషన్​ని ముగించింది. బ్యాంక్​ నిఫ్టీ 428 పాయింట్లు పెరిగి 55,45 వద్దకు చేరింది.

సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 2287.69 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 5,607.64 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు.

ఇక దేశీయ స్టాక్​ మార్కెట్​లు.. మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ని ఫ్లాట్​గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 25 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.

"జూన్​ 18న రానున్న ఫెడ్​ మీటింగ్​ ఫలితాలపై మదుపర్లు ఫోకస్​ చేశారు. నిఫ్టీ50 25,000 దాటితే 25,350 వరకు వెళ్లొచ్చు. 24,850 దిగువకు పడితే మరింత అ...