భారతదేశం, మే 19 -- శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ సూచీలు స్వల్ప నష్టాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 200 పాయింట్లు పడి 82,331 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 42 పాయింట్లు కోల్పోయి 25,020 వద్ద సెషన్​ని ముగించింది. బ్యాంక్​ నిఫ్టీ 1 పాయింట్​ పెరిగి 55,355 వద్దకు చేరింది.

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 8831.05 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 5,187.09 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు.

మే​ నెలలో ఎఫ్​ఐఐలు ఇప్పటివరకు రూ. 23782.64 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 23,298.54 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఇక దేశీయ స్టాక్​ మార్కెట్​లు.. సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని ఫ్లాట్​గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 15 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం...