భారతదేశం, ఆగస్టు 5 -- సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు లాభాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 419 పాయింట్లు పెరిగి 81,018 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 157 పాయింట్లు వృద్ధిచెంది 24,723 వద్ద సెషన్​ని ముగించింది. బ్యాంక్​ నిఫ్టీ 2 పాయింట్లు పెరిగి 55,619 వద్దకు చేరింది.

సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 2,403.89 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 4,256.55 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు.

ఇక దేశీయ స్టాక్​ మార్కెట్​లు.. మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ని నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 55 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.

"నిఫ్టీ50 రికవరీ మోడ్​లో ఉన్నట్టు కనిపిస్తోంది. 24,800-25,000 లెవల్స్​ వరకు వెళ్లొచ్చు. 24,650- 24,500 లెవల్స్​ దగ్గర సపోర్ట్​ ఉంది," అని ఎల్...