భారతదేశం, జూలై 11 -- గురువారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు నష్టాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 346 పాయింట్లు పడి 83,190 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 121 పాయింట్లు పడి 25,355 వద్ద సెషన్​ని ముగించింది. బ్యాంక్​ నిఫ్టీ 258 పాయింట్లు పడి 56,956 వద్దకు చేరింది.

గురువారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 585.96 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 20.50 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఇక దేశీయ స్టాక్​ మార్కెట్​లు.. శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 140 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.

"నిఫ్టీ50 షార్ట్​ టర్మ్​ ట్రెండ్​ నెగిటివ్​గా, వీక్​గా ఉంది. 25,250-25,200 లెవల్స్​ సపోర్ట్​గా ఉన్నాయి. 25,400- 25,500 లెవల్స్​ రెసిస్టెన్స్​గా ...