భారతదేశం, జూన్ 9 -- శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు భారీ లాభాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 747 పాయింట్లు పెరిగి 82,189 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 252 పాయింట్లు వృద్ధిచెంది 25,003 వద్ద సెషన్​ని ముగించింది. బ్యాంక్​ నిఫ్టీ 818 పాయింట్లు పెరిగి 56,578 వద్దకు చేరింది.

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 1,009.71 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 9,342.48 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు.

ఇక దేశీయ స్టాక్​ మార్కెట్​లు.. సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 70 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

"నిఫ్టీ50కి 24,800 లెవల్స్​ వద్ద 20 డే ఎస్​ఎంఏ ఉంది. దీని పైన ఉన్నంత కాలం సూచీ పాజిటివ్​గా ఉన్నట్టు అర్థం. 25,100 లెవల్స్​ వద్ద రెసి...