భారతదేశం, ఫిబ్రవరి 1 -- సీనియర్ నటుడు రాఘునాథ్ రెడ్డి మరణంతో టాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది. 370కి పైగా సినిమాల్లో నటించిన ఆయన తుదిశ్వాస విడిచారు. గుండె పోటుతో మరణించారు. నెల క్రితమే ఆయన కుమారుడు కన్నుమూశారు. ఆ బెంగతోనే కుమిలిపోతున్న రఘునాథ్ రెడ్డి ఈ రోజు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.

ఎన్నో సినిమాల్లో తన విలక్షణ నటనతో ఆకట్టుకున్నారు రఘునాథ్ రెడ్డి. సూపర్ హిట్ మూవీస్ లో నటించారు. విలన్ గానూ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేశారు. సీరియల్స్ లోనూ నటుడిగా తనదైన ముద్ర వేశారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, భోజ్ పురి భాషల సినిమాల్లోనూ ఆయన నటించారు. అలాంటి సీనియర్ నటుడు రఘునాథ్ రెడ్డి సడెన్ గా మరణించడంతో టాలీవుడ్ షాక్ అవుతోంది.

శోభన్ బాబు హీరోగా నటించిన సర్పయాగం సినిమాతో నటుడిగా రఘునాథ్ రెడ్డి అడుగు పడింది. ఈ చిత్రానికి పరిచూరి బ్రదర్స్ డైరెక్టర్స్....