భారతదేశం, జూన్ 2 -- జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అడ్వాన్స్​డ్ 2025 ఫలితాలను ఇండియన్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ కాన్పూర్) ఫలితాలను తాజాగా ప్రకటించింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను jeeadv.ac.in అధికారిక వెబ్​సైట్​లో చూసుకోవచ్చు. ఫలితాలతో పాటు ఫైనల్ ఆన్సర్ కీని కూడా ఐఐటీ కాన్పూర్​ విడుదల చేసింది.

జేఈఈ అడ్వాన్స్ డ్ ప్రొవిజినల్ ఆన్సర్ కీ మే 25న విడుదలైంది. అభ్యంతరాలు తెలిపేందుకు ఈ నెల 27వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అవకాశం కల్పించారు.

జేఈఈ అడ్వాన్స్​డ్ రిజల్ట్ 2025 చెక్ చేయడానికి డైరెక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

తాజాగా విడుదలైన జేఈఈ అడ్వాన్స్​డ్ ఫలితాల్లో కామన్ ర్యాంక్ లిస్ట్ (సీఆర్​ఎల్ )లో ఐఐటీ దిల్లీ జోన్​కు చెందిన రజిత్ గుప్తా అగ్రస్థానంలో నిలిచాడు. 360 మార్కులకు గాను 332 మార్కులు సాధించాడు. ఐఐటీ ఖరగ్​పూర్ జోన...