భారతదేశం, మే 19 -- కొవిడ్​ సంక్షోభం తర్వాత దేశంలోని చాలా మందికి స్టాక్​ మార్కెట్​లో ఇన్వెస్ట్​మెంట్స్​, ట్రేడింగ్​పై ఆసక్తి పెరిగింది. డబ్బులు ఎలా ఇన్వెస్ట్​ చేయాలి? ఎలా ట్రేడ్​ చేయాలి? అని సొంతంగా తెలుసుకుని అమలు చేస్తున్నారు. అయితే, స్టాక్​ మార్కెట్​లో పెట్టుబడి పెట్టాలన్నా, ట్రేడింగ్​ చేయలన్నా.. డీమ్యాట్​ అకౌంట్​ ఉండాల్సిందే. మరి మీరు కొత్తగా స్టాక్​ మార్కెట్​లోకి ఎంట్రీ ఇస్తుంటే.. ఒక డీమ్యాట్​ కచ్చితంగా తీసుకోవాలి. ఈ నేపథ్యంలో ఇండియాలో లీడింగ్​ బ్రోకరేజ్​ సంస్థ జెరోధాలో డీమ్యాట్​ అకౌంట్​ ఎలా ఓపెన్​ చేయాలి? ఏ డాక్యుమెంట్స్​ సమర్పించాలి? వంటి పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

భారతీయులకు అత్యంత నమ్మదగిన బ్రోకరేజ్​ సంస్థల్లో జెరోధా ఒకటి. 2025 నాటికి జెరోధాకు 7.96 మిలియన్​ మంది యూజర్లు ఉన్నట్టు సమాచారం. కస్టమర్స్​ని సంతృప్తి పరిచేందుకు ...