భారతదేశం, జూన్ 4 -- మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు నష్టాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 636 పాయింట్లు పడి 80,738 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 174 పాయింట్లు పతనమై 24,542 వద్ద సెషన్​ని ముగించింది. బ్యాంక్​ నిఫ్టీ 303 పాయింట్లు పడి 55,600 వద్దకు చేరింది.

మంగళవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 2853.83 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 5,907.97 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు.

జూన్​లో ఎఫ్​ఐఐలు ఇప్పటివరకు మొత్తం మీద రూ. 5443.3 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 11,221.73 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఇక దేశీయ స్టాక్​ మార్కెట్​లు.. బుధవారం ట్రేడింగ్​ సెషన్​ని లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 55 పాయింట్ల లాభంలో ఉండటం ఇంద...