భారతదేశం, జూన్ 19 -- జీమెయిల్ యూజర్ల కోసం భారీ సెక్యూరిటీ అప్డేట్ రాబోతోంది. మీరు ఇంకా మీ పాస్ వర్డ్ ను మార్చకపోతే లేదా టూ-స్టెప్ వెరిఫికేషన్ ను ఆన్ చేయకపోతే, మరింత ఆలస్యం చేయవద్దు. పెరుగుతున్న ఆన్ లైన్ బెదిరింపులు, ఫిషింగ్ దాడుల నుంచి రక్షణ కల్పించే చర్యల్లో భాగంగా జీమెయిల్ యూజర్లను తమ ఖాతాలను భద్రపరచుకోవాలని గూగుల్ అప్రమత్తం చేయడం ప్రారంభించింది. అంతేకాకుండా, 2-స్టెప్ వెరిఫికేషన్ (2ఎస్వి) ప్రారంభించడానికి కంపెనీ వినియోగదారులకు కేవలం 15 నుండి 30 రోజుల సమయం ఇస్తోంది.

గడువు లోగా 2-స్టెప్ వెరిఫికేషన్ యాక్టివేట్ చేసుకోని యూజర్లు తమ జీ మెయిల్ ఖాతాలకు యాక్సెస్ ను కోల్పోయే ప్రమాదం ఉంది. గూగుల్, ఆపిల్, ఫేస్ బుక్ వంటి ప్లాట్ఫామ్లలో 16 బిలియన్లకు పైగా పాస్వర్డ్లు లీక్ అయ్యాయనే వార్తలు వస్తున్నాయి.

మీ జీమెయిల్ ఖాతాను సురక్షితం చేసుకోవడానికిి ఈ కి...