భారతదేశం, ఏప్రిల్ 28 -- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ గాయపడ్డారు. జిమ్ లో వర్కౌట్స్ చేస్తుండగా గాయపడినట్లు కేటీఆర్ తెలిపారు. తన నడుముకు చిన్న గాయమైందంటూ కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. వైద్యుల సూచనతో కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలిపారు.

త్వరలో కోలుకుని ప్రజల ముందుకు వస్తానని చెప్పారు. నిన్న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేటీఆర్ పాల్గొ్న్నారు. కేటీఆర్ త్వరగా కోలుకోవాలని బీఆర్ఎస్ శ్రేణులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నాయి.

Published by HT Digital Content Services with permission from HT Telugu....