భారతదేశం, జూన్ 5 -- టీఎంసీ ఎంపీ, ఫైర్ బ్రాండ్ నేత మహువా మొయిత్రా బిజు జనతా దళ్ నేత, మాజీ ఎంపీ పినాకి మిశ్రాను జర్మనీలో సింపుల్ గా వివాహం చేసుకున్నట్లు సమాచారం. వారిద్దరు కలిసి ఉన్న ఫొటో ప్రస్తుతం ప్రధాన మీడియాతో పాటు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ జంటలో మహువా మొయిత్రా వయస్సు 50 ఏళ్లు కాగా, పినాకి మిశ్రా వయస్సు 65 సంవత్సరాలు.

టీఎంసీ ఎంపీ, ఫైర్ బ్రాండ్ నేత మహువా మొయిత్రా బిజు జనతా దళ్ (BJD) నేత, మాజీ ఎంపీ పినాకి మిశ్రాల వివాహం జర్మనీలో మే 30వ తేదీన జరిగినట్లు సమాచారం. అయితే, ఈ వివాహం గురించి ఇటు టీఎంసీ నేతలకు కానీ, అటు బీజేడీ నేతలకు కానీ సమాచారం లేదు. అలాగే, ఈ వివాహం గురించి, వారిద్దరి నుండి అధికారిక ధృవీకరణ రాకపోయినప్పటికీ, వివాహం జర్మనీలో జరిగిందని నివేదికలు సూచిస్తున్నాయి. ఇద్దరూ కలిసి ఉన్న ఫోటో కూడా బయటపడింది.

మహువా మొయిత్రా, పినా...