భారతదేశం, ఫిబ్రవరి 4 -- ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో మరో నిర్ణయం వెలువడింది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్ పై దాఖలైన అనర్హత పిటిషన్‌ను స్పీకర్ ప్రసాద్ కుమార్ కొట్టేశారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీశ్‌ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ కొట్టేస్తూ స్పీకర్‌ తీర్పును వెలువరించారు. పార్టీ మారారనడానికి సరైన ఆధారాలు లేవని తెలిపారు.

మరోవైపు ఈ కేసులో పిటిషనర్ గా ఉన్న ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి. స్పీకర్ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించారు. స్పీకర్ న్యాయబద్ధంగా పనిచేస్తలేరని విమర్శించారు. "బహిరంగంగా పార్టీ మారి కాంగ్రెస్ సమావేశాల్లో పాల్గొంటున్న స్పీకర్‌కి కనపడకపోవడం విచారకరం. బహిరంగంగా పార్టీ మారినట్లు అర్థమవుతున్నా చర్య తీసుకోకపోవడం దురదృష్టకరం" అని వ్యాఖ్యానించారు.

"స్పీకర్ ఏకపక్ష నిర్ణయం ప్రజలు గమనిస్తున్నారు.కాంగ్రెస్ చర్యల పట్ల ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయం. ...