భారతదేశం, మే 26 -- ఏపీపీఎస్సీ గ్రూప్‌ 1 జవాబు పత్రాల మూల్యాంకనం వ్యవహారం ముగ్గురు కమిషన్‌ ఉద్యోగుల పాత్రను పోలీసులు గుర్తించారు. వారిని కూడా ఈ కేసులో నిందితులుగా చేర్చేందుకు సిద్ధం అవుతున్నారు. గ్రూప్‌1 జవాబు పత్రాల మూల్యాంకనం కేసులో మాజీ ఇంటెలిజెన్స్‌ డీజీ పిఎస్సార్‌ ఆంజనేయులుతో పాటు కామ్‌సైన్‌ ప్రతినిధిని పోలీసులు ఆదివారం విచారించారు.

ఏపీపీఎస్సీ గ్రూప్‌1 జవాబు పత్రాల మూల్యాంకనం కేసులో పోలీసుల విచారణలో కీలక సమాచారాన్ని రాబట్టినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ కేసులో ఏపీపీఎస్సీ ఉద్యోగులు ముగ్గురికి ప్రత్యక్షంగా ప్రమేయం ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. పబ్లక్ సర్వీస్ కమిషన్‌ జవాబు పత్రాలను ఎవరి ఆదేశాలతో థర్డ్‌ పార్టీ వాల్యూయేషన్‌కు అప్పగించారనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో 2020-21 మధ్య కాలంలో కమిషన్ బాధ్యతలు పర్యవేక్షిం...