భారతదేశం, జనవరి 6 -- తిరుపతి జిల్లాలో ఘోరమైన ఘటన జరిగింది. సాంబలక్ష్మీ అనే మహిళను సోమశేఖర్ అనే వ్యక్తి హత్య చేశాడు. ఆ తర్వాత అతడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కొర్లకుంట మారుతీనగర్‌లో జరిగింది. ప్రశాంతంగా ఉండే ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం సృష్టించింది. వివాహేతర సంబంధమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే..

సోమశేఖర్ అనే వ్యక్తి గుత్తివారిపల్లికి చెందినవాడు. ఐదు ఏళ్లుగా కొర్లకుంట మారుతీనగర్‌లో గ్యాస్ ఏజెన్సీలో డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. అతడికి పెళ్లి అయింది. కానీ భార్యతో గొడవల కారణంగా వేరుగా ఉంటున్నాడు. ఇక తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన సాంబలక్ష్మీ కొంతకాలం జీవకోనలో నివసించేది. తర్వాత కొర్లకుంట మారుతీనగర్‌లో తన భర్త, కుమారుడితో కలి ఉంటుంది. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో సమోసాల దుకాణంలో పనిచేసేది....