Hyderabad, మే 21 -- థియేటర్లు మూతపడటం లేదు. జూన్ 1 తర్వాత కూడా థియేటర్లు తెరిచే ఉండనున్నాయి. తమ సమ్మె నిర్ణయాన్ని తెలుగు ఎగ్జిబిటర్ల సంఘం ప్రస్తుతానికి వాయిదా వేసింది. బుధవారం (మే 21) ఉదయం నుంచి తెలుగు ఫిలిం ఛాంబర్ లో జరిగిన చర్చలు ఫలించాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో జూన్ 1 తర్వాత కూడా థియేటర్లలో సినిమాలు ఆడనున్నాయి.

తెలుగు ఎగ్జిబిటర్ల అసోసియేషన్ జూన్ 1 నుంచి థియేటర్లను బంద్ చేయాలని గతంలో నిర్ణయించింది. దీనిపైనే ప్రధానంగా చర్చ జరిగింది. బుధవారం (మే 21) ఉదయం 11 గంటల నుంచి తెలుగు ఫిలిం ఛాంబర్, డిస్ట్రిబ్యూటర్ల మధ్య చర్చలు జరిగాయి. దీనికి తెలుగు రాష్ట్రాల నుంచి 40 మంది డిస్ట్రిబ్యూటర్లు హాజరయ్యారు.

సాయంత్రం 4 గంటలకు తెలుగు ఫిలిం ఛాంబర్, ప్రొడ్యూసర్ల మధ్య మరోసారి చర్చలు జరిగాయి. అయితే ఇటు డిస్ట్రిబ్యూటర్లు, అటు ప్రొడ్యూసర్లలో చాలా మంద...