Hyderabad, మే 23 -- సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఖలేజా మూవీ 15 ఏళ్ల కిందట రిలీజైనా.. బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా మిగిలిపోయింది. కానీ ఆ తర్వాత మెల్లగా ఈ సినిమాకు ఆడియెన్స్ నుంచి పాజిటివ్ రివ్యూలు రావడం మొదలుపెట్టింది. టీవీలో టెలికాస్ట్ అయినప్పుడల్లా మంచి రెస్పాన్స్ వచ్చేది. ఇప్పుడీ మూవీని మే 30వ తేదీన రీరిలీజ్ చేయబోతున్నారు.

ఖలేజా మూవీ మే 30న రీరిలీజ్ కానుండగా ఇప్పటికే బుక్ మై షోలో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం గంటకు 13 వేల టికెట్ల చొప్పున అమ్ముడవుతుండటం విశేషం. ఈ స్థాయి రెస్పాన్స్ ను అసలు ఎవరూ ఊహించలేదు. అసలు రీరిలీజ్ మూవీస్ విషయంలో ఇదో సరికొత్త రికార్డు. గతంలో పవన్ కల్యాణ్ గబ్బర్ సింగ్ మూవీ రీరిలీజ్ సమయంలో గంటకు గరిష్ఠంగా 5.5 వేల టికెట్లు అమ్ముడయ్యాయి.

కానీ ఇప్పుడు ఖలేజా మూవీకి అంతకంటే ఎంతో ఎక్కువ స్థాయిలో టికెట్లు...