భారతదేశం, జనవరి 31 -- కోఠి బ్యాంక్ స్ట్రీట్‌లో కాల్పులు కలకలం రేపాయి. తుపాకీతో కాల్పులు జరిపిన దుండగులు రూ.6 లక్షలు ఎత్తుకెళ్లారు. ఇవాళ ఉదయం 7 గంటలకు ఏటీఎంలో డబ్బులు డిపాజిట్‌ చేసేందుకు వచ్చిన రిషద్ అనే వ్యక్తిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో రిషద్‌ కాలికి తూటా గాయమైంది. ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఘటనాస్థలిలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు దుండుగులు కాల్పులు జరిపినట్లు గుర్తించినట్లు తెలిపారు.

Published by HT Digital Content Services with permission from HT Telugu....