భారతదేశం, మే 23 -- కృష్ణా జిల్లా గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానిపై లుకౌట్‌ నోటీసులు జారీ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. వైసీపీ ప్రభుత్వ హయంలో టీడీపీపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడటంతో పాటు చంద్రబాబును, లోకేష్‌ను వ్యక్తిగతంగా దూషించడంతో టీడీపీకి టార్గెట్‌గా మారారు. దీంతో ఆయన విదేశాలకు వెళ్ళి పోకుండా నోటీసులు జారీ చేసినట్టు ప్రచారం జరుగుతోంది.

వైసీపీలో రాజకీయ ప్రత్యర్థులపై దూకుడు ప్రదర్శించే నాయకుల్లో ఒకరైన కొడాలి నాని ఓటమి తర్వాత హైదరాబాద్‌కు పరిమితం అయ్యారు. 2024 ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత కొడాలి నాని కొద్ది సార్లు మాత్రమే గుడివాడకు వచ్చారు.

ఈ క్రమంలో గుడివాడలో కొడాలి నాని అనుచరులపై పలు కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో నాని అనుచరుల్ని ఇప్పటికే అరెస్ట్‌ చేశారు. వైసీపీ ప్రభుత్వ హయంలో జరిగిన మట్టి తవ్వకాలు, అక్రమ చేపల చెరువుల తవ్వకాలు, భూ క...