భారతదేశం, ఫిబ్రవరి 1 -- 2026 బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చింది. ఆంధ్రప్రదేశ్‌కు మౌలిక సదుపాయాలు, గ్రామీణాభివృద్ధి, విద్యకు స్పష్టమైన నిధుల కేటాయింపులు ఉన్నాయి. అమరావతి అభివృద్ధి చేయడానికి వివిధ విభాగాలకు నిధులు మంజూరు చేశారు.

మొత్తం మీద రాజధాని అభివృద్ధికి సుమారు రూ. 1128.91 కోట్లు కేటాయించారు. అమరావతి ఇంటిగ్రేటెడ్ అర్బన్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టుకు ఐబీఆర్‌డీ నిధుల ద్వారా రూ. 432.09 కోట్లు లభించాయి. రాష్ట్రంలో పట్టణ తాగునీరు, మురుగునీటి పారుదల మెరుగుదలలకు రూ. 800 కోట్లు కేటాయించగా, రోడ్లు, వంతెనల పునర్నిర్మాణానికి రూ. 350 కోట్లు కేటాయించారు. రాష్ట్రంలోని గ్రామీణ రోడ్ల ప్రాజెక్టులకు రూ. 500.99 కోట్లు కేటాయింపులు ఉన్నాయి.

వ్యవసాయ రంగంలో సహజ వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడాన...