భారతదేశం, మే 12 -- భారత్​- పాకిస్థాన్​ కాల్పుల విరమణ, అమెరికా- చైనా వాణిజ్య యుద్ధాని బ్రేక్​ పడటం వంటి అత్యంత సానుకూల పరిణామాల మధ్య దేశీయ సూచీలు సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని అతి భారీ లాభాలతో ముగించాయి. బెంచ్​మార్క్​ సూచీలు సెన్సెక్స్​, నిఫ్టీ50.. దాదాపు 4శాతం మేర లాభపడ్డాయి. ఇండెక్స్​లు ఒక్క ట్రేడింగ్​ సెషన్​లో ఈ స్థాయిలో లాభాలను చూడటం 4ఏళ్లల్లో ఇదే తొలిసారి! అంతేకాదు, తాజా బుల్​ రన్​తో సోమవారం ఒక్కరోజే బీఎస్​ఈ సెన్సెక్స్​ కంపెనీల మార్కెట్​ క్యాపిటల్​ దాదాపు రూ. 16లక్షల కోట్లు పెరిగింది.

బీఎస్ఈ సెన్సెక్స్ 2,975 పాయింట్లు (3.74 శాతం) పెరిగి 82,430 వద్ద స్థిరపడింది. ఆల్ టైమ్ గరిష్ట స్థాయి అయిన 85,978 నుంచి 4 శాతం దూరంలో, ఈ రోజు 82,495.97 వద్ద గరిష్టాన్ని తాకింది. నిఫ్టీ 916.70 పాయింట్లు (3.82%) పెరిగి 24,944.80 పాయింట్ల వద్ద ముగిసింది.

ఇది...