భారతదేశం, మే 27 -- వైసీపీ హయాంలో జిల్లాల విభజన, జిల్లాల పేర్ల మార్పులు విషయంలో నాటి ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించింది. చారిత్రక నేపథ్యం, పురాతన వారసత్వం, స్థానిక ప్రజల మనోభావాలను పట్టించుకోకుండా రాజకీయ కారణాలతో జిల్లాల విభజన ఎడాపెడా చే సేశారు.

ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో అప్పట్లో కొందరు అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై కసరత్తు ప్రారంభించినపుడు ప్రధానంగా లోక్‌సభ నియోజక వర్గాలను ప్రాతిపదికగా చేసుకున్నారు. కడపను వైఎస్సార్‌ కడపగా మార్చిన ప్రభుత్వం ఎన్టీఆర్‌ జిల్లాను మాత్రం విస్మరించింది.

ఈ క్రమంలో జిల్లాలు, స్థానిక మండలాల్లోని గ్రామాల్లో ప్రజలకు ఉన్న అనుబంధాలను పోగొట్టుకోవాల్సి వచ్చింది. పార్లమెంటు నియోజక వర్గాలు వేర్వేరుగా ఉన్నా ఉమ్మడి జిల్లాలకు మాత్రం ఐదారు దశాబ్దాలుగా కొనసాగుతూ వచ్చాయి. జిల్లాల సరిహద్దుల విభజనలో...