భారతదేశం, జూన్ 22 -- బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్‍గణ్ ప్రధాన పాత్ర పోషంచిన రైడ్ 2 చిత్రం మంచి హిట్ సాధించింది. ఈ ఏడాది మే 1వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. అందుకు తగ్గట్టే కలెక్షన్లను బాగానే దక్కించుకుంది. 2018లో వచ్చిన రైడ్‍కు సీక్వెల్‍‍గా ఈ మూవీ తెరకెక్కింది. రైడ్ 2 చిత్రానికి రాజ్ కుమార్ గుప్తా దర్శకత్వం వహించారు. ఈ మూవీ ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్‍కు సిద్ధమైంది.

రైడ్ 2 సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ దగ్గర ఉన్నాయి. ఈ సినిమాను ఈ శుక్రవారం జూన్ 27వ తేదీన స్ట్రీమింగ్‍కు తీసుకొచ్చేందుకు ఆ ప్లాట్‍ఫామ్ రెడీ అయిందని సమాచారం బయటికి వచ్చింది. తేదీపై అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది.

థియేటర్లలో రిలీజైన 8 వారాల తర్వాత రైడ్ 2 చిత్రం నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలోకి రానుంది. మే 1న రిలీజైన ఈ చిత్రం.. జ...